2, నవంబర్ 2024, శనివారం

సాంఖ్య యోగము - ముఖ్యాంశాలు

1. అపరిమితమైన దుఃఖము కీలక ఘట్టములలో సంభవించును (2-2).

2. మనో దుర్బలత్వంచే మానవులు నిర్వీర్యులగుచున్నారు(2-3).

3. పండితులైనవారు జీవనమును మరణమును ఒకే విధంగా స్వీకరించుదురు. (2-11)

4. మానవులకు శాశ్వతత్వం పొందు అవకాశం ఉంటుంది.(2-12).

5. ఏది విశ్వమంతటను వ్యాపించి ఉన్నదో, అవ్యయమగు దానిని  వినాశము చేయులేరు. అప్రమేయుడు దేహము నందున్నాడు. కానీ దేహములు నాశవంతములు కావున ఆ స్థితి నుండి తెలియబడడు (2-17).

6. జీవన్మరణముల చక్రములు మానవుల ముందుంచిన అతి క్లిష్టమైన పరీక్షలు (2-27).

7. మానవుడు ఈ జీవ మున్న​ చిన్ని కాల వ్యవధి అందే తాను పొందిన అవకాశమును సార్థకం చేసుకొనవలెను (2-28).

8. మానవులు చేపట్టుటకు ఒకే ఒక మార్గం కలదు (2-41). తక్కినవన్నీ అపమార్గములు.

9. సమత్వంలో స్థితుడై ఉండుట ఒకటియే పేర్కొనబడినది (2-48).

10. కర్మ ఫలమును గోరువారు అల్పులు (2-49).

11. ఆ మార్గాన్వేషణమున భోగైశ్వర్యముల యొక్క ప్రసక్తి ఉండదు. స్వర్గనరకములు,  పుణ్యపాపముల ప్రసక్తి ఉండదు. నిష్కామకర్మ ఒక్కటియే సూచించబడినది (2-50).

12. (శబ్దాది) విషయములు ఎండగొట్టుటవలను, దూరముగా ఉంచుట వలనను ​ తొలగుటలేదు. అవి కేవలము సత్య దర్శనం వలననే తొలగుచున్నవి. (2-59).

13. ఇంద్రియముల చర్య​లు జీవులందరి మీద ఒకే విధమైన ప్రభావం చూపించును. అప్రమత్తత లేక జీవులు బాధలను పడుతున్నారు. (2-68).

14. మన ఎదుటి ప్రపంచము విలోమ దర్పణంలా పనిచేయుచు పరీక్షించు చున్నది. యోగులు జీవనమును తెలియుటలోను; జీవులు విషయములు అనుభవించుటలోనూ సమయం వెళ్ళబుచ్చుదురు (2-69).

15. ఆ గంభీరమైన స్థితికి చేరినప్పుడు లోపలి/వెలుపలి విషయములు మానవుని బాధింపలేవు. (2-70)

x-x-x-x

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి