27, ఏప్రిల్ 2024, శనివారం

2-13: సాంఖ్య యోగము. 13వ శ్లోకము

 శ్రీ భగవానువాచ:

శ్లో|| దేహినోఽస్మిన్ యథా దేహే 
కౌమారం యౌవనం జరా

తథా దేహాంతరప్రాప్తిః 

ధీరస్తత్ర న ముహ్యతి ||(2-13)||

టీక: దేహినః = జీవునకు, అస్మిన్ దేహే = ఈ శరీరమునందు, కౌమారమ్ = బాల్యము, యౌవనమ్ =యౌవనము, జరా = వార్ధక్యము, యథా = ఎట్లుకలుగునో, తథా = అట్లే, దేహాన్తర ప్రాప్తిః = మఱియొక శరీరమును బొందుటయు (కలుగుచున్నది), తత్ర = ఆ విషయమున, ధీరః = జ్ఞాని, నముహ్యతి = మోహము నొందడు (శోకింపడు).

భావము:  జీవునకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్థక్యము ఉన్నట్లే మరియొక దేహప్రాప్తియు కలుగును. ధీరులైన వారు ఈ విషయమును గ్రహించి, వ్యధ చెందరు. 

వ్యాఖ్యానము:

విచారణ  వ్యర్థముమరణము అనివార్యం; ఐననూ దానిపట్ల భయంతో మానవులు అనేక  చర్యలు చేపట్టుదురు. మరణము, దాని తరువాత వానిపై అనేక వివరణలు వున్నప్పటికీ అవి యేవియు నిర్ధారించబడలేదు. వానిపై విచారణ చేయుట వ్యర్థము. 

ధీరుడుఇక్కడ ధీరుడు అనగా వీరత్వంతో కూడిన ధీరత్వం కాదు. ఎటువంటి విపత్కరమైన పరివర్తనమునైనా  స్వీకరించువాడు, ప్రాణములను సైతము ఎటువంటి ప్రతిఘటనలేకయే ధైర్యముగా విడుచువాడు అని అర్థం. 

జడత్వముఇంకొంచెం ఆలోచిస్తే మానవులు తాము ప్రస్తుతము వున్న దశలోని మార్పులను తీవ్రముగా వ్యతిరేకించుదురు. ఆ ప్రయత్నమే మనకు 'ఇది నాది; అది వారిది లేదా నాది కాదు" అను సరిహద్దులు సృష్టించును. ఒక రకముగా చెప్పాలంటే మనమందరము జడత్వమునకు  (subjected to inertial effects of matter) లోనై మనము ప్రస్తుతము ఉన్న స్థితిలోనే  ఉండుటకు ప్రయత్నం చేస్తాము.  

క్షీణించుట: మన దేహము అను భారముతో గురుత్వాకర్షణ శక్తికి త్వరత్వరగా అనుగుణముగా స్పందించలేక పోవుటను, వూహలు అను మోపులతో  ఏర్పరచుకున్న "నేను" కూడా ప్రకృతి కల్పించు మార్పులకు త్వరత్వరగా చలించలేక పోవుటతో పోల్చవచ్చును. దీనితో "నేను" మనో వ్యథకు గురియై క్షీణతకు దారితీయును.    అధోపతనం అనునది సిద్ధాంతము కాదు. మనమే నిర్ధారించగల సత్యము. ఈ రకముగా మనము కాలము అను నాలుగవ అంశమునకు లోనవుతాము. ఇదియే మనను సత్యమునుండి వేరుపరచునది.

జీవమొక్కటే: మన ప్రస్తుత రూపముతోనే మన ప్రస్తుత మనస్థితిలోని మార్పులను సంపూర్ణముగా స్వీకరించుట ధీరత్వం. తమకై తాము ఏర్పరచుకున్న సరిహద్దులు ఏమాత్రము ధర్మబద్ధం కాదు. ధర్మమై జీవించుట ఒక్కటియే జీవించుట, వేరన్నియు అసంబద్ధములు. చేపట్టరానివి. 
 
తమలోనిసమ్మతము: అనగా మానవుడు చేపట్టు చర్యలన్నీ ప్రతిక్రియలు ప్రతిఘటనలు అని తెలియవలెను. ఈ ప్రతిక్రియల గోలుసులలో మానవుడు చిక్కుకుంటాడు. వీనిని లంపటములు అని సూక్ష్మంగా సెలవిచ్చారు. ఈ శ్లోకంపై మరింత వివరణ 2-69వ శ్లోకము వివరణలో కూడా చెప్పుకుందాం. మార్పును నూటికి నూరు శాతము స్వీకరించునది జీవనము అనిఒక్కింత కూడా (ఒక శాతము కూడా) వ్యతిరేకించునది మరణము అని తీసుకోన వలెను. 

ఇదియే క్షేత్రక్షేత్రజ్ఞ యోగము: ఈ విషయము గురించి మరింత విపులముగా కర్మ యోగమునందు క్షేత్రక్షేత్రజ్ఞ యోగమునందు మరియు అనేకానేక శ్లోకములలో దీనిని మననము చేసుకుంటాం.

గ్నోతి సూయేటోన్ (Gnothi Seuton) అని సోక్రటీస్ చెప్పినది ‘నిన్ను నీవు తెలుసుకో' ‘మార్పును తెలియుదానిని తెలుసుకోఅని అర్ధము. ప్రతిఘటించు దానికి తాను ప్రతిఘటిస్తున్నానని తెలియదు. ఆ ఎఱుక ప్రతిఘటన ఐన తర్వాత తెలుస్తుంది. అందుకే ఎంతో నైపుణ్యం, ఎంతో అనుభవం గడించినవారు కూడా ఆతృతతో “పలుకరానివి పలుకుట వలన అనేక కష్టములకు దారితీసిన సంగతులు మనమూ నిత్యం వార్తా పత్రికలలో చూస్తూనే ఉన్నాం. క్షణ క్షణమూ  ఈ ప్రతిఘటన మార్పు చెందుతూ మానవుని పరీక్షిస్తోంది. 

ప్రత్యామ్నాయము లేదుఐ​​నప్పటికీ ఈ ప్రకృతిలో సర్వ పదార్థములును పునరుపయోగించ బడుచున్నవి. మానవులు సైతము దీనిలో భాగమే. దీనిని రూపపరిణామము; రూపాంతరము చెందుటతో పోల్చవచ్చును. కానీ ఈ రూపాంతరము తన పూర్వ రూపముతో సంబంధములేని వేరు దశకు వికారము చెందుచూ, క్షణ క్షణమునకు మారుచూ రూపాంతర క్రియ ఇదియని చెప్ప నలవిగాకున్నది. ఏ రూపాంతరములోనైనా పుట్టుట గిట్టుట​ తప్పని సరి. మరణ భయముతో ఈ క్రియలో పాల్గొనలేని వారు, భౌతికముగా ఎంత సాధించినప్పటికీ వారు పిరికివారే.

అన్వయార్ధముకాల గమనముతో భౌతికముగా మన శరీరములో చూపు  మార్పుల కంటే, ఇప్పటి స్థితినుండి వేరొక స్థితికి మారుటకు మానసిక ప్రతిస్పందనను గమనించి దానిని ఉన్నది ఉన్నట్లు స్వీకరించువాడే ధీరుడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి