సంజయ ఉవాచ
శ్లో|| తం తథా కృపయా೭విష్టం
అశ్రు పూర్ణా కులేక్షణమ్|
విషీదంత మిదం వాక్యం
ఉవాచ మధుసూదనః|| (2-1)
టీక: తం — అట్లు ; తథా — ఆ విధంగా; కృపయా — జాలితో; ఆవిష్టం — చొచ్చినది,
ఆవేశము ఆవహించినది;
అశ్రుపూర్ణాకులేక్షణమ్
— కన్నీరు నిండి వ్యాకులమైన నేత్రములు గలవాడును;
విషీదంతం —
దుఃఖించువాడును; ఇదం వాక్యం — ఈ (చెప్పబోవు) వాక్యమును;
ఉవాచ — పలికెను;
మధుసూదనః — శ్రీ
కృష్ణుడు.
భావము: సంజయుడు కురుక్షేత్రంలో
జరుగుతున్న సంఘటనలు ధృతరాష్ట్రునికి వివరంగా చెబుతున్నాడు. "ఆ విధముగా
అర్జునుని కనులలో అశ్రువులు నిండి అతని వ్యాకులపాటును, శోకమును
తెలుపుతున్నవి. అప్పుడు అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు
ఇట్లనెను".
వ్యాఖ్యలు:
1. తగిన సమయం
రానిదే జ్ఞానం మనస్సు లోకి ఎక్కదు. అందుకే, భగవానుడు
అర్జునుని పరిస్థితి తెలిసీ, ఇప్పటిదాకా మిన్నకుండెను.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి